టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలను ప్రొడ్యూస్ చేయడంతో పాటు అనేక సినిమాల్లో నటించి మెప్పించిన ఈయన బిజినెస్ పరంగా చాలా కరెక్ట్ గా ఉంటారు. అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా మాస్ మాహారాజా రవితేజకు మాయ మాటలు చెప్పి కోట్లలో మోసం చేశానని అన్నారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Mahesh babu Update : మహేష్ కోసం ఆ హాలీవుడ్ హీరోయిన్ ని దింపుతున్న జక్కన్న..
పాతిక ఎకరాల భూమి కొన్న రవితేజ
రవితేజకు భూమి కొనుక్కోవాలనే కోరిక ఉండడంతో ఆ విషయాన్ని బండ్ల గణేష్ కు చెప్పారట. దీంతో ఆయన తన పక్కనే అమ్మకానికి ఉన్న భూమిని చూపించారట. అలా బండ్లన్న సాయంతో రవితేజ పాతిక ఎకరాల భూమి కొనుగోలు చేశారట. ఆ తర్వాత కొంత కాలానికి బండ్ల గణేష్ తన భూమిని అమ్ముకోవాలని భావించారట. అయితే కొనుగోలు చేసే వాళ్లు మాత్రం ఆయన 40 ఎకరాల భూమితో పాటు పక్కనే ఉన్న రవితేజ భూమి కూడా కావాలని.. రెండూ కలిపి ఇస్తేమని కొంటామని అన్నారట.
baby movie : బ్లాక్ డే రోజున ప్రేమికుల దినోత్సవ సంబరాలేమిటో..?
సైలెంట్ గా నవ్వి ఊరుకున్న రవితేజ
దీంతో బండ్ల గణేష్ ఆ విషయాన్ని రవితేజకు చెప్పకుండా.. ప్రభుత్వం భూములు తీసుకుంటుంది.. ఏదో పని మీద అమ్మేయాలని చెప్పి ఇద్దరి భూమిని అమ్మేశారట. అయితే ఇది జరిగిన కొంత కాలానికి బండ్ల గణేష్ కు.. తాను రవితేజను మోసం చేసినట్లు అనిపించిందట. తరచుగా మనసులో అదే తిరుగుతుంటే నేరుగా ఆయన వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పారట. ఇదంతా విన్న రవితేజ కోప్పడి కొట్టాల్సింది పోయి.. సైలెంట్ గా నవ్వి ఊరుకున్నారట.
భవిష్యత్తులో కచ్చితంగా ఆయన రుణం తీర్చుకుంటా..
రవితేజ ఏమీ అనకుండా నవ్వి ఊరుకోవడంతో తనకు తప్పు చేసిన భావనం ఇంకా ఎక్కువ అయిందట. గతంలో ఆయన ప్రొడ్యూస్ చేసిన ఓ సినిమాకు రవితేజ హీరోగా చేయగా… తనకు 5 కోట్ల రూపాయల లాభం వచ్చిందట. అదంతా గుర్తుకు వచ్చి మరింత బాధగా అనిపించిందట. దీంతో భవిష్యత్తులో ఆయన కోసం ఏదైనా చేసి ఆయన రుణం తీర్చుకోవాలని బండ్లన్న గట్టిగా ఫిక్స్ అయ్యారట. ఇదే విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాకిచ్చారు.
Supritha Video Viral : పగలు పూజలు.. రాత్రి పబ్ లో డ్యాన్సులు.. సుప్రీత వీడియొ వైరల్..