Interesting Facts About America : ఇండియాలో పూజలకు, పునస్కారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. అలాగే మంత్రాలు, క్షుద్రపూజలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. క్షుద్రపూజలు చేశారనే కారణంతో చాలామంది వాటికి బలి కూడా అయ్యారు. ఇప్పటికి కూడా క్షుద్రపూజలకు భయపడని వారంటూ ఉండరు. చేతబడి లాంటి సంఘటనలు ఇండియాలో చాలానే జరుగుతూ ఉంటాయి.
మూఢనమ్మకాలు ఇండియాలో అధికంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇండియా సరసన అమెరికా కూడా చేరింది. ఇప్పుడు అమెరికాలో క్షుద్రపూజల వార్త కలకలం రేపుతుంది. అమెరికాలో 300 సంవత్సరాల క్రితం క్షుద్ర పూజలు చేసే వ్యక్తులను ఉరి తీసే చట్టం అమలులో ఉండేది. ఆ చట్టాన్ని ఈమధ్య రద్దు చేశారు. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో క్షుద్ర పూజ చేసే వారిని ఉరితీసే చట్టాన్ని రద్దు చేస్తున్నట్లుగా ఈ మధ్య ప్రకటించారు.
దానిలో భాగంగా ఉరిశిక్ష నేరాన్ని అనుభవిస్తున్న వారి శిక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. 12 మందిని నిర్దోషులని కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే 370 సంవత్సరాల క్రింద జరిగిన సంఘటన. అమెరికా వలసవాదుల చేతుల్లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. అప్పట్లో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికి ఉరిశిక్ష పడి మరణించిన వారి వారసులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారంట.
ఈ పరిస్థితిని చూసిన కనెక్టకట్ రాష్ట్రం క్షుద్ర విద్యలు చేస్తే ఉరి తీసే చట్టాన్ని తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. క్రీ.శ 1600 నుంచి క్రీ.శ 1700 మధ్య కాలంలో క్షుద్రపూజల విధానం అమలులో ఉన్నట్లు తెలుస్తుంది. 370 సంవత్సరాల కిందట జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు తీర్పు చెప్పడం ఏంటి.. అని ఉరి
తీయడం తప్పని చెప్పడం వల్ల ఇప్పుడు ఎవరికి లాభమని జరిగిపోయిన నష్టమంతా జరిగిపోయింది కదా.. అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తీర్పుల వల్ల, ఇలాంటి సంఘటన వల్ల ఎవరికి ఉపయోగం ఉండదని దీనిని ఇప్పుడు తెరమీదకి తీసుకురావలసిన అవసరమేంటని చాలామంది అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.