P.Gannavaram Janasena : పి.గన్నవరం జనసేనదే.. ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ, జోష్ లో జనసైనికులు
అనేక నాటకీయ పరిణామాల మధ్య కోనసీమ జిల్లాకి చెందిన పి.గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీకి దక్కింది. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించారు. కొన్ని వారాల క్రితం జనసేన, టిడిపి తొలి జాబితా అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు ఈ సీటు టిడిపికి వెళ్ళింది.
రాజేష్ మహాసేనకు ఆ టికెట్టు కేటాయించారు. కానీ ఊహించని వ్యతిరేకత, ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకోవడంతో రాజేష్ మహాజన పక్కకి తప్పుకున్నారు. ఆ తర్వాత సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు పి.గన్నవరం జనసేనకు కేటాయించబడింది.
నేడు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేన నేత గిడ్డి సత్యనారాయణకి పవన్ కళ్యాణ్ టికెట్ కేటాయిస్తూ ఎన్నికల నియమావళి పత్రాన్ని అందించారు. పి. గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించాలని ముందు నుంచి జనసైనికులు కోరుతున్నారు. ఎందుకంటే ఆ నియోజకవర్గం జనసేన పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న ప్రాంతం.
పి.గన్నవరం నియోజకవర్గం జనసేనదే
స్థానిక ఎన్నికల్లోనే సత్తా చాటారు… సార్వత్రిక ఎన్నికల్లోనో అదే స్ఫూర్తి కొనసాగించాలి
పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
శ్రీ గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి పత్రాలు అందించిన శ్రీ #pawanKlayn గారు… pic.twitter.com/OIpXQUwaf0
— JanaSena Party (@JanaSenaParty) March 23, 2024
ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ 30 శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 3 వేల ఓట్ల తేడాతో ప్రజారాజ్యం ఈ సీటుని కోల్పోయింది. 2019లో జనసేజ్ సరైన ప్రణాళిక లేకుండానే దాదాపు 25 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఈసారి జనసేనకి ఇక్కడ ఊహించని స్థాయిలో బలం పెరిగింది. ఇక్కడ జనసేన పోటీ చేస్తే తప్పకుండా మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని టీడిపి అధినేత చంద్రబాబుకి కూడా తెలుసు.
కానీ రాజేష్ మహాసేనని ప్రోత్సహించేందుకు ముందు ఈ సీటు టిడిపికి అనుకున్నారు. ఎలాగోలా ఇప్పుడు పి. గన్నవరం జనసేన పార్టీ సొంతం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పిగన్నవరంలో జనసేన అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకుని అద్భుతమైన విజయం సాధించింది. దీనితో పవన్ కళ్యాణ్ కూడా పి. గన్నవరంపై బలమైన విశ్వాసంతో ఉన్నారు.