TDP-JSP alliance : జనసైనికులూ.. సేనాని పొత్తు ఎత్తుగడని అర్థం చేసుకోండిలా..
కుదిరితే 40 లేదా 35 స్థానాలు జనసేన పార్టీకి పొత్తులో కేటాయించబడతాయి అని జనసైనికులంతా భావిస్తూ వచ్చారు. కానీ జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే దక్కాయి. ఇది కాస్త జనసేన కార్యకర్తలని, అభిమానులని, టికెట్లు ఆశించిన నాయకులని నిరాశ కలిగించే అంశమే. కానీ జనసేన క్యాడర్ పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
పవన్ కళ్యాణ్ ఎత్తుగడ ఏంటో తెలిసిన వారు ఇంకా ఉత్సాహంతో జనసేన పార్టీకి పనిచేస్తారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు ఏంటా ఎత్తుగడ అనే విషయాన్ని చూద్దాం. ఇతర పార్టీల్లో సింగిల్ గా పోటీ చేసినప్పుడే నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు టికెట్ ఆశించే ఆశావహులు ఉంటారు. ఒకరికి టికెట్ దక్కితే మరొకరు నిరాశ చెందుతుంటారు. కొన్నిసార్లు టికెట్ దక్కని వాళ్ళు రెబల్ అభ్యర్థులుగా మారే ప్రమాదం ఉంది.
ఇక జనసేన, టిడిపి పొత్తులో ఉన్నప్పుడు ఇంకెంతమంది రెబల్ అభ్యర్థులుగా మారుతారో ఊహించలేం. 40, 50, 60 స్థానాల్లో పోటీ చేసినప్పుడు ఎక్కువ స్థానాల్లో రెబల్ అభ్యర్థుల సమస్య రావచ్చు. తద్వారా ఓట్ ట్రాన్స్ఫర్ సమస్య తలెత్తుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ టిడిపి నుంచి ఎలాంటి సమస్య లేని.. జనసేన పక్కగా గెలిచే 24 సీట్లని ఎంచుకున్నారు. టీడీపీ వాళ్ళు సహకరిస్తేఇంకో 20 స్థానాలు తీసుకున్నా తప్పులేదు. ఎందుకంటే గత ఎన్నికల కంటే ఇప్పుడు జనసేన బలం పెరిగింది. ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలో టిడిపి నేతలని బుజ్జగించాల్సి ఉంటుంది.
అది తలనొప్పుతో కూడుకున్న వ్యవహారం. ఇక ఇందులో రెండో కోణం పరిశీలిస్తే 50 స్థానాలు తీసుకుని అందులో 30 మాత్రమే గెలిస్తే చాలా విమర్శలు వస్తాయి. జనసేన పార్టీ బలం గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితం అనే టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఈ 24 లో కూడా జనసేన ఎక్కువగా పోటీ చేస్తోంది ఉభయగోదావరి జిల్లాల్లోనే.
కానీ ఇప్పుడు 24 కి 24 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం జనసేనకు ఉంది. పవన్ కళ్యాణ్ 98 పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండాలని అంటున్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్ కొట్టడం పెద్ద కష్టం కాదు. అప్పుడు జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచింది. ఆ పార్టీ బలం పెరిగింది అనే మాట రాష్ట్రం మొత్తం వ్యాపిస్తుంది. ప్రజల్లో జనసేన పార్టీ ఏపీలో థర్డ్ ఫోర్స్ అని బలంగా నమ్ముతారు. ఆ నమ్మకం జనసేన పార్టీ బలం రెట్టింపు చేసే అవకాశం ఉంది.
ఇక మూడవ కోణం పరిశీలిస్తే.. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా గెలుపు చూడలేదు. ఈసారి పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం ఎక్కడ ఎలా పోటీ చేసినా గెలుపు ఖాయం. ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు జనసేన కూడా కొన్ని స్థానాలు గెలుస్తుంది. ఆ నంబర్ ఎంతో చెప్పలేం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. జనసేన, టిడిపి, వైసిపి మూడు పార్టీలు బలంగా ఉన్న ఒక నియోజకవర్గాన్ని తీసుకుందాం. అక్కడ త్రిముఖ పోరువల్ల, డబ్బు మద్యం ప్రలోభాల వల్ల వైసిపి అడ్వాంటేజ్ పొందే అవకాశం ఉంది.
ఉదాహరణకి జనసేనకు ఒక నియోజకవర్గంలో 33 శాతం ఓట్లు, టిడిపికి 33 శాతం ఓట్లు వస్తే.. వైసిపి 34 శాతం ఓట్లతో సీటుని ఎగరేసుకుపోతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు పొత్తులో కొన్ని సీట్లు తగ్గినప్పటికీ బలమైన నేతలతో కలసి అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పార్లమెంట్ లో కూడా జనసేన ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నారు.