Tenth Class Exams:నేటి నుండే పదవతరగతి పరీక్షలు…”ట్రెండ్ ఆంధ్రా” తరపున ఇవే మా శుభాకాంక్షలు
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదవతరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మా “ట్రెండ్ ఆంధ్రా” తరపున పదవతరగతి విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుచున్నాము .
ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయి అని విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు.ఏ మాత్రం ఆలస్యం, ఆఖరికి నిమిషం ఆలస్యం అయినా సరే విద్యార్థులని పరీక్షా హాలులోకి అనుమతించబోమని, కాబట్టి విద్యార్థులు ఒక అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
కాబట్టి విద్యార్థులు అందరూ విద్యా శాఖ అధికారులు సూచించినట్టు, నిర్ణీత సమయంలోపు పరీక్షా కేంద్రానికి చేరుకొని, పరీక్షలు బాగా రాసి అందరూ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులు కావాలని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరుకుంటూ మరోసారి ఇవే మా “ట్రెండ్ ఆంధ్ర” తరపున పదవతరగతి విద్యార్థులు అందరికీ హార్దిక శుభాకాంక్షలు.. Best Of Luck