Varalaxmi Sarathkumar : తల్లిని కావాలని ప్రయత్నించా, ప్లాన్ వర్కౌట్ కాలేదు..నా జీవితంలో అతిపెద్ద తప్పు అదే
సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం సౌత్ లో మంచి ఆఫర్స్ అందుకుంటోంది. తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ క్రాక్, యశోద, వీరసింహారెడ్డి ఇలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హను మాన్ చిత్రంలో కూడా వరలక్ష్మి నటించింది.
ఇటీవల వరలక్ష్మి.. తన స్నేహితుడు ముంబైకి చెందిన సచ్ దేవ్ అనే వ్యక్తిని నిశ్చితార్థం చేసుకుంది. త్వరలో వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెడుతోంది. అతడికి ఇది రెండవ వివాహం. అయినప్పటికీ వరలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకోబోతోంది. ఇటీవల ఇంటర్వ్యూలో వరలక్ష్మి తన కెరీర్ లైఫ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.
తన లైఫ్ లో ఏది ప్లాన్ చేసినట్లు జరగలేదని వరలక్ష్మి తెలిపింది. 18 ఏళ్ళ వయసులోనే సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. బాయ్స్ లాంటి చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే నాన్న ఇంత చిన్న ఏజ్ లో వద్దని చెప్పారు. ఆ తర్వాత శింబు పొడా పొడీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాను. ఆ చిత్రం నిరాశపరచడం నా కెరీర్ కి మైనస్ గా మారింది.
28 ఏళ్ళ వయసు వచ్చేసరికి స్టార్ హీరోయిన్ కావాలని ప్లాన్ చేసుకున్నా. కానీ అది జరగలేదు. 32 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలనుకున్నా.. అదీ కుదర్లేదు. 34 ఏళ్ళకి ప్రెగ్నన్సీ కోసం ప్రయత్నించా. తల్లి కావాలనేది నా కోరిక. అది కూడా నెరవేరలేదు అని వరలక్ష్మి నిరాశ వ్యక్తం చేసింది. పొడా పొడీ చిత్రం తర్వాత కెరీర్ కంటే నా పర్సనల్ లైఫ్ పై ఎక్కవగా ఫోకస్ చేశా. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. పర్సనల్ లైఫ్ పై కాకుండా కెరీర్ పై ఫోకస్ పెట్టి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని అని వరలక్ష్మి గుర్తు చేసుకుంది.