శుభలేఖ సుధాకర్ గురించి అందరికీ తెలిసిందే. శుభలేఖ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ది గ్రేట్ లెజండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజను పెళ్లి చేసుకున్నారనే విషయం కూడా విధితమే. అయితే తాజాగా శుభలేఖ సుధాకర్ షాకింగ్ కామెంట్లు చేశారు. తన వల్లే ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయారని.. తాను కూడా ఆయన చావుకు ఓ కారణం అని వెల్లడించారు.
కరోనా సమయంలో కూడా షూటింగ్ లో పాల్గొన్న సుధాకర్
ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంకు స్వయామా బావ అయిన శుభలేఖ సుధాకర్.. కరోనా సమయంలో కూడా షూటింగ్ లో పాల్గొనేవారట. అయితే ఈ సమయంలోనే ఎస్పీ బాలు ఫోన్ చేసి.. కరోనా సమయంలో అవసరమా అని అడిగారట. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఒకే ఒక్క షూటింగ్ ఇదని చెప్పారట. శానిటైజ్ చేస్తున్నారు, మాస్కులు వాడుతున్నారు, అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటారని.. అందుకే ఎలాంటి సమస్య లేక తాను ఈ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు చెప్పారట.
Anil Sunkara: ఏజెంట్ మూవీ నష్టాల వివాదం, కోర్టులో కేసు.. నిర్మాత అనిల్ సుంకర సీరియస్ వార్నింగ్
అనుకోకుండా షూటింగ్ కు వచ్చిన ఎస్పీ బాలు
అయితే ఓ రోజు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం షూటింగ్ స్పాట్ కు వచ్చారట. శుభలేక సుధాకర్ తో కలిసి చాలా సేపు మాట్లాడారట. అక్కడే ఉన్న కొంత మంది ఆయనతో ఫొటో దిగాలని అడిగితే.. ఒకటే కదా దిగమని సుదాకర్ చెప్పారట. దీంతో సెల్ఫీలకు అవకాశం ఇవ్వకపోయినా.. కాస్త దూరంగా ఉండి ఒక్క ఫొటో అడిగిన వాళ్లు మొత్తం 96 ఫొటోలు దిగారట. ఆ తర్వాత మూడు రోజులకే ఎస్బీ బాలుకు కరోనా సోకిందని.. ఆస్పత్రిలో జాయిన్ చేశారని వార్తలు వచ్చినట్లు వెల్లడించారు.
మూడ్రోజులకే కరోనాతో ఆస్పత్రి పాలైన ఎస్పీబీ..
ఆ తర్వాత తాను ఆస్పత్రికి వెళ్లడం.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి మరింత దిగజారిపోవడం.. ఆ తర్వాత ఆయన చనిపోవడంతో అంతా జరిగిపోయాయని.. శుభలేఖ సుధాకర్ వెల్లడించారు. అప్పటి నుంచి తనకు.. తాను చేసిన తప్పు వల్లే ఆయన చనిపోయారనే భావన ఉందని… అది తాను భూమిపై ఉన్నన్ని రోజులు మనసులోంచి పోదని వెల్లడించారు. ఇలా శుభలేఖ సుధాకర్.. ఎస్బీబాలు చావుకు కారణం అయినట్లు వివరించారు.