Nandamuri Mokshagna : నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ, ఇప్పటి వరకు అఫీషియల్ న్యూస్ ఏదీ నందమూరి ఫ్యామిలీ నుంచి రాలేదు. ఇప్పటికే అక్కినేని, మెగా, అల్లు, ఘట్టమనేని ఫ్యామిలీల నుంచి నట వారసులు వచ్చి స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. ఆ జనరేషన్ వారిలో బాలయ్య ఒక్కడే ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నారు. బాలయ్య తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేకమై స్థానాన్ని సంపాదించుకున్నారు.
అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ మాత్రం ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి మోక్షజ్ఞ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికాలో యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. త్వరలో మోక్షజ్ఞతో మూవీని అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే మోక్షజ్ఞకు జోడీగా నటించే ఫస్ట్ హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఇక హీరోయిన్ కూడా ఫిక్స్ అయిందని సమాచారం. ఆ అమ్మడు ఎవరో కాదు యంగ్ బ్యూటీ శ్రీలీల.
Mahesh Babu : సూపర్ స్టార్ తో వర్క్ చేయడం డ్రీమ్ అంటున్న యంగ్ బ్యూటీ..
ప్రెసెంట్ ఈ అమ్మడి లిస్ట్ లో ఆరడజనుకుపైగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న భగవంత్ కేసరి. ఈ మూవీలు శ్రీలీల యాక్టింగ్, ఎనర్జీకి బాలయ్య ఫిదా అయ్యాడట. తన కొడుకు మోక్షజ్ఞ మూవీకి ఈ అమ్మడు కరెక్ట్ గా సరిపోతుందని అనుకున్నారట. దీంతో మోక్షజ్ఞ సరసన నటించే ఫస్ట్ హీరోయిన్ శ్రీలీల అని ప్రచారం జరుగుతుంది. ఈ న్యూస్ లో నిజమెంతుందో తెలియాలి అంటే.. ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.