Venu Swamy : సలార్ మూవీ ఫ్లాప్, మళ్ళీ వివాదం రేపిన వేణు స్వామి.. అక్కడ తప్ప మిగిలిన అన్ని చోట్ల నష్టాలే
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం గత ఏడాది డిసెంబర్ లో విడుదలై మంచి విజయం సాధించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానుల ఆకలి తీర్చిన చిత్రం ఇదే అని చెప్పాలి. ప్రభాస్ ని మాస్ అవతార్ లో ప్రశాంత్ నీల్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు.
యాక్షన్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. దీనితో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకున్నారు. అయితే ఈ చిత్రం సాధించిన వసూళ్ళపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నార్త్ లో, నైజాంలో తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లో బయ్యర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.
అయితే సలార్ రిలీజ్ కి ముందే వేణు స్వామి.. ప్రభాస్ ఇప్పట్లో హిట్ దక్కడం కష్టం అని.. సలార్ కూడా ఫ్లాప్ అవుతుందంటూ కామెంట్స్ చేశారు. సలార్ రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని దారుణంగా ట్రోల్ చేశారు.
అయితే ఇప్పుడిప్పుడే బిజినెస్ లెక్కలు బయటకి వస్తుండడంతో వేణు స్వామి మరోసారి తన నోటికి పని చెప్పి వివాదాన్ని మొదలు పెట్టారు. సలార్ మూవీ ఫ్లాప్ అని నేను ముందే చెప్పాను. కానీ నన్ను అప్పుడు కిందా మీదా ఏసుకున్నారు కదరా.. ఇప్పుడు ఏమైంది అంటూ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా ఆయన పోస్ట్ చేశారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ చిత్రాన్ని హోంబేలె సంస్థ నిర్మించింది. శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. సీక్వెల్ కి సలార్ శౌర్యంగపర్వం అని టైటిల్ ఫిక్స్ చేశారు.