AP PoliticsAP Elections 2024 : రాజకీయ పార్టీలలో బిగుస్తున్న ‘సీటు’ముడి..!!
పార్టీల మధ్య తీవ్రరూపం దాల్చిన వర్గపోరు.. వర్గాలుగా చీలిపోయిన టీడీపీ. జనసేన.. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా జన సైనికులు.. అంతకంటే దూరం పాటిస్తున్న టీడీపీ..
Pedana Constituency : పెడన సీట్ జనసేనదే..!!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ, జనసేన మధ్య పడిన ‘సీటు’ముడి రోజురోజుకూ బిగుసుకుపోతోంది. రెండు పార్టీల మధ్య రాజకీయ కాక తారస్థాయికి చేరగా.. ఇరుపార్టీల నేతల మధ్య సిగపట్లు పెరిగాయి. ఉభయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా పరస్పర మాటల యుద్ధంతో రచ్చకెక్కుతున్నారు. టికెట్ తమదంటే.. తమదంటూ అనుకూల సమీకరణాలు చెప్పుకుంటూ హడావుడి చేస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ టీడీపీతో దోస్తీ ప్రకటించిన నాటినుంచి రెండు పార్టీలూ కలిసికట్టుగా నిర్వహించిన కార్యక్రమాలు లేకపోగా.. తాజా పరిణామాలు ఆ పార్టీల మధ్య మరింత దూరం పెంచుతోంది.
జనసేన,, టీడీపీ నుంచిరు టికెట్లు ఆశిస్తూ వర్గాలుగా విడిపోయి హంగామా సృష్టిస్తున్నారు. దీంతో కూటమి వర్గాలుగా చీలిపోయింది. తాజా పరిణామాలతో టీడీపీ కార్యక్రమాలకు జన సైనికులు దూరం జరగ్గా.. జన సైనికులతో అంతకంటే ఎక్కువగా టీడీపీ దూరం పాటిస్తోంది.
మింగుడు పడని రాజకీయం :
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చేశారు. అయతే, ఎన్నికల పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ-జనసేన.. సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి.. రెండు పార్టీల అధినేతలు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, ముద్రగడ పద్మనాభం ఇంకా జనసేనలో చేరకముందే.. ఆయనను ఏ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఇరు పార్టీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. కాకినాడ సిటీ నుంచి ముద్రగడను పోటీ చేయించి కాపు సామాజిక వర్గ మద్దతును కూడగట్టాలన్నది జనసేన వ్యూహం.
టీడీపీలో టికెట్ లొల్లి :
టీడీపీలో టికెట్ లొల్లి తారాస్థాయికి చేరడంతో గందరగోళం నెలకొంది అభ్యర్థులు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్న కొద్దిపాటి కేడర్ను చెల్లాచెదురు చేస్తున్నారు.
వైఎస్ఆర్సీపీ పార్టీలో సుడిగాలి:
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలల్లో విజమే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత, ముఖ్యమంత్రి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సమన్వయకర్తలు, వివిధ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇన్ఛార్జ్లను నియమించారు. ఈ కోఆర్డినేటర్లు మరియు ఇన్ఛార్జ్లు ఈ స్థానాల్లో ప్రస్తుతమున్న వారి స్థానంలో కొత్త ఇంచార్జి అభ్యర్థులు అవుతారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల గెలుపు సామర్థ్యం ఆధారంగా మార్పుల కు శ్రీకారం చుట్టినా అది వైసీపీ లో సుడిగాలి సృష్టింస్తోంది. సీట్లు రాని వాళ్ళు ఇతర పార్టీ ల్లో చేరుతున్నారు స్దానాలు మారిన ఆభ్యర్దులకు స్దానికంగా క్యాడర్ ఏమేర మద్దత్తు ఇస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. పార్టీ ఎదైనా కాని పార్టీలో ఉన్న అశావహులు , పార్టీకి విధేయులు, ఇతర పార్టీలనుంచి వచ్చిన వారు వీరిని సమన్వయ పరుస్తూ అసమ్మతిని చల్లారుస్తూ గెలుపు గుఱ్ఱలను ఎంపిక చేయటం అపార్టీ ఆధిష్టానానికి ఆశిధార వ్రతమే. సామాజిక సమీకరణాలు , వర్గ సమీకరణాలను ప్రాత్తిపదికగా తీసుకుని ముందుకు వెళ్ళాలి కాబట్టి ,అభ్యర్దుల ఎంపికను మరింత జటిల తరం కావచ్చు. బిగుస్తున్న ‘సీటు’ముడి పార్టీకి బంధమా లేక బంధనమా? అన్న ది పార్టీ పెద్దలను వేధిస్తున్న సమస్య ఏది ఎమైనా రాజకీయం లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఆధికారం చేపట్టటమే పార్టీల పరమావధి. ఈ పరిస్దితులను గమనిస్తున్న ఓటర్ తన తీర్పు తో సరైన ఆభ్యర్దిని ఎంచుకుని మార్పు తెస్తాడు అనేది నిజం .
Discussion about this post