Roja Comments on Sharmila : చెల్లి షర్మిల మీదకు రోజాను వదిలిన జగన్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో వేడి మరింత పెరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇక తెలంగాణ నుంచి ఏపీకి వైఎస్ షర్మిల షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. అక్కడ అన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తనదైన శైలీలో విమర్శలు చేస్తున్నారు. ఇక రాజకీయాల్లో అన్న, తమ్ముడు అనే భేదాలు లేకుండా షర్మిల విరుచుకుపడ్డారు.
ఇటీవల షర్మిల రోజాపై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రోజా నగరిని దోచుకుంటుందని ఆరోపణలు చేశారు షర్మిల. అయితే వైఎస్ జగన్ రెడ్డి.. చెల్లి షర్మిల మీదకు రోజాను వదలినట్లు తెలుస్తోంది. షర్మిల చేసిన కామెంట్స్ కు రోజా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. తాజాగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Janasena : ఇక్కడ జనసేన విజయం లాంఛనమే..
షర్మిలకు సవాల్ విసురుతున్నట్లు చెప్పిన రోజా… తన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణల్లో ఒక్కదాన్నైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సలావ్ విసిరారు. నీ లాగా నేను వైఎస్సార్ బిడ్డ అని చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం కాదని కౌంటర్ ఇచ్చారు. నేను రోజా. నా సొంత కష్టంతో ఎవరి మద్దతు లేకుండా సినిమాల్లోనూ, రాజకీయాల్లో ఎదిగానని షర్మిలకు తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చారు.
సినిమాలు, టీవీ షోలు వదులుకుని.. ప్రజలకు సేవచేయాలని పట్టుదలతో రాజకీయాల్లోకి వచ్చినట్లు రోజా చెప్పుకువచ్చారు. తన కుటుంబంలో అన్నలు, భర్త అండగా నిలబడ్డారని.. ఎవరూ ఏ పదవి ఆశించలేదని వెల్లడించారు.తన వాళ్లు ఎవరినీ బెదిరించలేదని.. ఎక్కడ డబ్బు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల కాంగ్రెస్ లో చేరిందని.. వైఎస్సార్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారని రోజా కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో దూరి నీతులు చెబుతుంటే సామెతలు గుర్తుకొస్తున్నాయని షర్మిలను రోజా ఎద్దేవ చేశారు.