ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినినిమాలు నిర్మించడంతో పాటు అనేక సమస్యలు కొని తెచ్చుకునే ఈయన.. తాజాగా మరో సమస్యలో పడ్డారు. తాజాగా ఒంగోలు కోర్టు ఏడాది పాటు బండ్ల గణేష్ కు జైలు శిక్ష విధించింది. ఎందుకు, ఏమిటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Bandla Ganesh : రవితేజకు మాయ మాటలు చెప్పి అలా కోట్లలో మోసం చేశా.. దానికి ఆయన ఏం చేశారంటే?
బండ్ల గణేష్కు ఏడాది జైలు శిక్ష..
ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.. 2019లో ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద నుంచి 95 లక్షల రూపాయలు తీసకున్నా. ఆ తర్వాత తన ప్రొడక్షన్ సంస్థ అయిన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ సంస్థ నుంచి.. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెక్ ను ఇచ్చారు. అయితే ఈ చెక్ బౌన్స్ అవడంతో ఆయన కేసు ఫైల్ చేశారు. ఇలా ఈ కేసు ఒంగోలు సెకండ్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లగా.. ఈ రోజు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
మందు తాగనా – పాలు తాగనా? – సిగ్గు లేకుండా జగపతి బాబు షాకింగ్ కామెంట్స్
95 లక్షల జరుమానా విధించిన ధర్మాసనం
బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానాను కూడా విధించింది. అయితే ఒంగోలు కోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు.. బండ్ల గణేష్ కు నెల రోజుల గడువు కూడా ఇచ్చింది. మరి బండ్ల గణేష్ తర్వాత ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు, ఏం చేయబోతున్నారో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
ఇదంతా ఇలా ఉండగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారారు. అనేక పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తూ.. బాగానే సంపాధించుకున్నాడు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు అనేక రకాల బిజినెస్ లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతూ మరింత రచ్చ చేసే ఈయన.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని.