Janasena NRI’s : శాన్ ఫ్రాన్సిస్కో లో ఏకమైన జనసేన, టిడిపి, బిజెపి నేతలు.. బొలిశెట్టి సత్యనారాయణ మాటలకు మారుమ్రోగిన ఆడిటోరియం
జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్నారైలు ఎంతో అండగా నిలుస్తున్నారు. వీలైనప్పుడల్లా ఇండియా వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఏపీలో జనసేన, బిజెపి, టీడీపీ పార్టీలు పొత్తులో కలిశాయి. దీనితో ఎన్డీయే కూటమిని గెలిపించేందుకు NRI లు కూడా ఏకం అవుతున్నారు. ఆదివారం రోజు శాన్ ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో 100 మందికి పైగా జనసేన, టిడిపి, బిజెపి నేతలు ఆత్మీయంగా కలుసుకున్నారు.
ఈ సమావేశం లో పలువురు NRI లు తోపాటు ఆంధ్రపదేశ్ లో ఉన్న జనసేన టిడిపి నాయకులు జూమ్ కాల్ లో జాయిన్ అయ్యి NRI లతో కీలక చర్చలు జరిపారు. రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో NDA కూటమిని అధికారంలోకి రావాలసిన ఆవశ్యకత గురించి చర్చించారు. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అరాచక పాలన మీద పలువురు NRI లు ఆందోళన వ్యక్తం చేసారు. 2014 లో మాదిరి కూటమి బంపర్ మెజారిటీ సాధించడం ఖాయం అంటూ కొంతమంది NRI లు తమ అభిప్రాయాలు తెలిపారు.
కొంత మంది ప్రముఖులు మాట్లాడుతూ ఆంధ్రపదేశ్ లో సామన్య ప్రజల సెన్సిటివ్ డేటా ని వాలంటీర్ల ద్వారా సేకరించి ఆ డేటా ని తప్పుదారి పట్టించేలా చెస్తున్నారు అని, ఎదురుతిరిగి మాట్లాడితే నియంతాలా మారి అధికారం బలంతో వేధిస్తున్నారు అన్నారు. ఇటువంటి పాలనని ఇంటికి పంపించకపోతే మనం సొంత రాష్ట్రం కి కూడా వెళ్లలేని పరిస్తితులు తీసుకొస్తాడు ఈ నియంత జగన్ అంటూ మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయింది అని, ఇంకోసారి ఈ సైకో వస్తే మనం పూర్తిగా ఆంధ్రపదేశ్ ని మర్చిపోవచ్చు అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.
ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి మనం అందరం ఇంకా బలంగా పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని, మనవంతు ఆర్ధిక సహాయాన్ని జనసేన తెలుగుదేశం కూటమికి అందించడం తోపాటు గ్రౌండ్ లో కూటమి అభ్యర్థులకి ప్రచారం చేయాలి అని, దానికి కావలసిన ఆర్ధికమైన నిధులు మనమే సమాకూర్చుకుందాం అని తీర్మానించుకున్నట్టు పలువురు NRI లు తెలియచేసారు.
ఈ సమావేశంలో జనసేన నాయకులు శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారు, తెలుగుదేశం నాయకులు అరిమిల్లి రాధాకృష్ణ గారు, తంగిరాల సౌమ్య గారు జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎన్నారైలని ఉత్సాహ పరిచేలా జూమ్ కాల్ లో ప్రసంగించారు. ఎన్డీయే కూటమి అఖండ మెజారిటీతో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీనితో ఆడిటోరియం హర్షద్వానాలతో మారుమ్రోగింది.