పేరుకే చిన్న సినిమా, కానీ పెద్ద పెద్ద సినిమాలకు కూడా సాధ్యం కాని బంపర్ హిట్టు కొట్టిన మూవీ. చిన్న దర్శకుడు, చిన్న హీరో, పెద్ద తారాగణం కూడా కాదు.. కానీ ఆ మూవీ టీమ్ కొట్టిన హిట్టు సౌండ్ దేశం మొత్తం దద్దరిల్లిపోయింది. అదే హనుమాన్ సినిమా. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సినీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది, ఇంకా అలరిస్తూనే ఉంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన హనుమాన్.. ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
Subhaleka Sudhakar : “ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోవడానికి నేను కూడా ఓ కారణమే?”
50 రోజులకు దగ్గరకు వస్తుండగా అదిరిపోయే ప్లాన్
తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై నెల రోజులు పూర్తయ్యాక కూడా థియేటర్లలో హౌజ్ ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ కాలంలో మొదటి వారం వరకు ఆడితేనే ఆ సినిమా సూపర్ హిట్ గా పరిగణించాల్సి వస్తోంది. అలాంటిది ఏకంగా నెల రోజుల పాటు హౌజ్ ఫుల్ షోలతో రన్ అవుతుండటం చిన్న విషయమేం కాదు. మరికొన్ని రోజుల్లో 50 రోజుల మైలు రాయిని కూడా అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హనుమాన్ మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై 100, 150 రూపాయలకే టికెట్లు అందుబాటులో..
ఈ మూవీని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు నిర్ణయం తీసుకుంది హనుమాన్ టీమ్. టికెట్ల రేట్లను మరింతగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. టికెట్ల రేట్లను భారీగా తగ్గించింది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో టికెట్ల ధరలను తగ్గిస్తున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా చెప్పుకొచ్చారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.175గా ఉండగా, ఇకపై టికెట్లు రూ.100 కే లభించనున్నాయి. అలాగే మల్టీప్లెక్స్ లలో రూ.295గా ఉన్న టికెట్ల ధరలను ఏకంగా రూ.150 కి తగ్గించారు. దాదాపుగా సగానికి తగ్గించారు.
ఫిబ్రవరి 16 నుంచి 23వ తేదీ వరకు ఆఫర్
తగ్గించిన ఈ టికెట్ల ధరలు ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని హనుమాన్ మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.