ప్రతిపక్ష నాయకుల సమావేశాలకు, సభలకు, రోడ్డు షోలకు అడ్డుపడటం, శాంతి భద్రతల కారణాలు, అనుమతులు లేవంటూ చెబుతూ నాయకులను అడ్డుకోవడం లాంటివి చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. తమ పార్టీ నేతల కార్యక్రమాలు అయితే అప్పటికప్పుడు నిబంధనలు మారుస్తూ, అనుమతులు ఇస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది జగన్ సర్కారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల వద్దకు వెళ్లకుండా కుటిల బుద్ధితో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది.
Yatra 2: ‘యాత్ర 2’ అనుకున్నంత ప్రభావం చూపిందా.. వైసీపీకి ఒరిగిందేంటి ?
హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి లేదంటూ..
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జనసేనాని ఈ రోజు భీమవరంలో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణించే హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి లేదంటూ ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్ కు సహకరించకలేదు.
Janasena : ఇక్కడ జనసేన విజయం లాంఛనమే..
కాలేజీ మేనేజ్మెంట్ నుంచి అనుమతులు తీసుకున్న నాయకులు
భీమవరంలోని విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలోని హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ దిగేందుకు కాలేజీ మేనేజ్మెంట్ నుంచి జనసేన నాయకులు అనుమతి కూడా తీసుకున్నారు. అయితే ఆర్ అండ్ బీ అధికారులు మాత్రం మోకాలడ్డటంతో పవన్ కళ్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏవేవో కుంటిసాకులు చెప్పి ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడానికి ప్రయత్నించడం వైసీపీ పిరికిపంద చర్య అని జనసేన నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
విచిత్రమైన కారణాలు చెబుతూ అడ్డుకుంటున్న అధికారులు
హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతించని ఆర్ అండ్ బీ అధికారులు విచిత్రమైన కారణాలు చెప్పుకొచ్చారు. విష్ణు ఇంజినీరింగ్ కాలేజీలోని హెలీప్యాడ్ ల్యాండింగ్ కు అనువుగా ఉండదని, దీని వల్ల హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ కాకూడదని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్న కారణం. అయితే ఇదే ప్రాంతంలో అనేక సార్లు హెలికాప్టర్లు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో మంది ప్రముఖులు ఈ హెలీప్యాడ్ వద్దే ల్యాండ్ అయి వివిధ ప్రాంతాలకు రోడ్డు మార్గాన వెళ్లిన సందర్భాలు అనేకం.
Chandrababu Naidu – YS Jagan : జగన్ పై చంద్రబాబుకు ఎందుకంత పట్టుదల..?
వర్షాలు పడి ఆ ప్రాంతమంతా బురదమయం అయిందని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఎండలు దంచికొడుతున్న ఈ సమయంలో హెలీప్యాడ్ వద్ద ఎలాంటి సమస్యలు లేవని జనసేన నాయకులు చెబుతున్నారు. హెలీకాప్టర్ దిగేందుకు అనుమతులు ఇవ్వకపోవడంపై హైకోర్టును ఆశ్రయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ లీగల్ సెల్ కు ఆదేశాలు ఇచ్చారు. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలో జరగాల్సిన సమావేశాలు పార్టీ కేంద్ర కార్యాలయంలోనే నిర్వహిస్తున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది.
Jagan Met Amit Shah : అమిత్ షా ఎత్తుగడ.. ఢిల్లీకి జగన్.. చంద్రబాబు ఆగ్రహం..