పిల్లలు టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్ టాప్లతోనే సమయాన్ని గడుపుతూ ఆలస్యంగా నిద్ర పోతుంటారు. అయితే పెద్దవారితో పోలిస్తే పిల్లలు ఎక్కువ సమయం పాటు నిద్ర పోవాలి. లేదంటే.. అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత, చురుకుదనం లోపించడం, మానసిక ఒత్తిడి, శరీరకంగా బలహీన పడటం, తరచూ అలసిపోవడం, శరీర రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల, తల్లిదండ్రులు పిల్లలను తొందరగా నిద్రపుచ్చాలి. అందుకు ఏం చేయాలి అంటే..
సాధారణంగా చాలామంది పిల్లలు నిద్ర రావడం లేదని చెప్పి టీవీ చూస్తూ లేదంటే స్మార్ట్ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అయితే అలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు మంచి కథలు చెప్పడం లేదా ఏవైనా పుస్తకాలు చదివి వినిపించడం చేస్తే.. పిల్లల ఊహాశక్తి పెరుగుతుంది. అలాగే త్వరగా నిద్రలోకి జారుకుంటారు.
Also Read: రాత్రులు సరిగా నిద్ర పట్టాలి అంటే.. ఇలా చేసి చూడండి
అంతేకాకుండా పిల్లలు త్వరగా నిద్ర పోవాలంటే వారి డైట్లో జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, షుగర్ ఫుడ్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే, ఈ ఆహారాలు వారి నిద్రను దెబ్బ తీస్తాయి. పిల్లలకు రాత్రి భోజనం చేసిన ఒకటి లేదా రెండు గంటల తర్వాత గ్లాస్ గోరు వెచ్చని పాలు తాగించాలి. ఇలా చేస్తే త్వరగా నిద్రపోతారు. అలాగే వారు పడుకునే రూమ్ ప్రశాంతంగా, మంచి గాలి వచ్చే విధంగా చూడాలి. రాత్రి రూమ్ లో తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోవాలి.
Discussion about this post