Janasena Chief Pawan Kalyan : కేరళ బోటు ప్రమాదం గురించి స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కేరళ బోటు ప్రమాదం చాలా విషాదకరమని, ఒకే కుటుంబానికి చెందిన 11 మంది చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయమని పవన్ కళ్యాణ్ విచారాన్నీ తెలియజేసారు.
కేరళ రాష్ట్రం, మల్లాప్పురం జిల్లా ,తుఫాన్ తీరం దగ్గర హౌస్ బోటు బోల్తా పడిన దుర్ఘటనలో 22 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా చనిపోవడం అందరిని కలిచి వేస్తున్న విషయం. పవన్ కళ్యాణ్ మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
ఈ ప్రమాదాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ ఒక గుణపాఠంగా తీసుకోవాలి. పర్యాటణకు వస్తున్న ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది. తగిన జాగ్రత్తలు చేపట్టకుండా ఇలా ప్రజల ప్రాణాలను గాలికి వదిలేయడం సమంజసమైన విషయం కాదు. పాపికొండల్లో జరిగిన ప్రమాదాన్ని ఎవరు మర్చిపోకముందే, ఇలాంటి మరో దుర్ఘటన జరగడం చాలా బాధాకరం.
జలవిహారయాత్రకు వచ్చే ప్రాంతాల్లో పకడ్బందీ నిబంధనలు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.