Kidney Cleansing Food : మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఏ ఒక్క అవయవం పనితీరులో మార్పు వచ్చిన మనం అనారోగ్య బారిన పడతాం ముఖ్యంగా వాటిల్లో కిడ్నీ ప్రధానమైనది కిడ్నీలు డ్యామేజ్ అయితే పర్ఫెక్ట్ మొత్తం శరీరం పైన పడుతుంది కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..
కిడ్నీలలో ఉండే వ్యర్ధాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లి పోవాలి. ఈ ప్రాసెస్ కి నిమ్మ జాతికి చెందిన పండ్లు చాలా మంచిది. ఈ పండు తినడం వల్ల శరీరంలో తేమ పెరుగుతుంది. అలాగే పండ్లల్లో అధిక మోతాదులో సీట్రేట్ ఉంటుంది. ఈ పండ్లు కిడ్నీలో రాళ్లు రాకుండా చూస్తాయి. అలాగే మూత్రంలో తక్కువ ఆమ్లాన్ని ఈ పండ్లు అడ్డుకుంటాయి.
మన మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో దోసకాయ కూడా బాగా పనిచేస్తుంది. దోసకాయలో ఎక్కువగా నీరు శాతం ఉంటుంది. దోసకాయ తరచూ తినడం వల్ల కిడ్నీలో పనితీరు బాగుంటుంది అలాగే శరీరాన్ని కూడా చలువ చేస్తుంది. వీటితో పాటు క్రాన్ బెర్రీస్ మనకు మార్కెట్లో చాలా దొరుకుతాయి. ఈ పండ్లను తింటే మూత్రపిండాలు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. వీటిని జ్యూస్ రూపంలో కూడా తాగవచ్చును. ఈ పండ్ల వల్ల శరీరం హైడ్రేడ్ గా ఉంటుంది. కిడ్నీలల్లో, అలాగే శరీరంలో ఉన్న వ్యర్ధాలు కూడా బయటకి విసర్జింపబడతాయి.
పైన చెప్పిన పండ్లు తీసుకుంటూ, వాటితోపాటు శరీరానికి అవసరమైన నీళ్లను ప్రతిరోజు తాగాలి. ఇది ప్రధమం నీరును ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు శుభ్రపడి డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. నీరు శరీరాన్ని హైడెడ్ గా ఉంచడమే కాకుండా, మూత్రపిండాల్లో ఉన్న వ్యర్ధాలను బయటికి పంపించేస్తుంది.