Disadvantages with Pain Killers : ప్రస్తుతం నడుస్తున్న సమాజంలో ఆహారం లో నాణ్యత లేకపోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలో ముఖ్యంగా మనకు మామూలుగా వచ్చే తలనొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పి ఇలా ఏదో ఒక నొప్పితో మనము బాధపడుతూ ఉంటాము. అయితే ఈ నొప్పులను నివారించుకోవడం కోసము కొంతమంది పెయిన్ కిల్లర్స్ ని యూస్ చేస్తూ ఉంటారు.
అది కూడా ఎటువంటి డాక్టర్ సలహా లేకుండానే మెడికల్ షాప్ లలో తెచ్చుకొని వాడేస్తారు. కానీ ఇది చాలా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ వల్ల ప్రమాదాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కాస్త నొప్పి అనిపించిన వెంటనే ఆ నొప్పి సహజంగా తగ్గుతుంది అనుకోకుండా వెంటనే పెయిన్ కిల్లర్స్ వాడేస్తారు. అలా వాడడం వల్ల నొప్పి ఎక్కడైతే వస్తుందో, ఆ భాగంలో ఎముకలు మరియు కండరాలు స్పర్శ కోల్పోవడమే కాకుండా, దానికి కారణమైన రోగాలను మాత్రం నయం చేయలేవు.
అలా తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడితే అందులో ఉన్న కెమికల్స్ మన బోన్స్ స్ట్రెంత్ ని తగ్గించడమే కాకుండా రాను, రాను ఎముకలు బలహీనంగా కూడా తయారవుతాయి. పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మన శరీరంలో ఎక్కువగా నష్టపోయేది కిడ్నీలు. మెడిసిన్ గుణాలు, కిడ్నీ పనితీరును దెబ్బతీయటమే కాకుండా కిడ్నీలలో రాళ్లు ఏర్పడడంలో సహాయపడతాయి. ఇది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కిడ్నీలు పూర్తిగా పనిచేయకుండా అవుతాయి. అదేవిధంగా మన శరీరంలోని నరాలు మెదడుకు నొప్పి సమాచారాన్ని పంపుతాయి.
పెయిన్ కిల్లర్స్ దెబ్బ తగిలిన ప్రదేశం లేదా వెన్నుపాము లేదా మెదడు ఈ మూడు ప్రదేశాల్లో ఏదో ఒక ప్రదేశాన్ని మొద్దు పరిచి సిగ్నల్స్ రాకుండా చేస్తాయి. ఇంత ప్రమాదం ఉంది పెయిన్ కిల్లర్స్ తో.. పెయిన్ కిల్లర్ ఎక్కువగా వాడితే అక్కడ ఉన్న నరాలు దెబ్బతినమే కాకుండా, బెడ్ సర్కులేషన్ కూడా ఆగిపోతుంది. డాక్టర్ సలహా లేకుండా మెడిసిన్స్ అసలు వాడకూడదు. వీలైనంత సహజంగా నొప్పిని తగ్గించే ఆహారాలు తో నొప్పిని తగ్గించుకోవడం మంచిది. అది ఆయుర్వేద మందులతో సాధ్యమవుతుంది.