Health Tips : ప్రతి మనిషి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. లేకపోతే అనారోగ్యం బారిన పడతారు. వాటిల్లో కాళ్ళు శుభ్రపరచుకోవడం కూడా ఒకటి. మన శరీరంలో ఎక్కువ భాగం అపరిశుబ్రానికి లోనయ్యేది కాళ్లు. బయటికి వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు కడుగకపోతే దరిద్రం చుట్టుకుంటుందని మన పెద్దవాళ్లు చెబుతూనే ఉంటారు.
అయితే ఆయుర్వేద శాస్త్రం లో కూడా రాత్రి నిద్రపోయే సమయంలో కాళ్లు కడుక్కోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. కొందరి పాదాలను మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా వేడిగా ఉంటాయి. అలాంటి వారి పాదాలు రాత్రులు శుభ్రం చేసుకోవడం వల్ల పాదాలలో ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది.
పాదాలలో ఉన్న బ్యాక్టీరియా శుభ్రం కావాలంటే పాదాలను రాత్రి పడుకునే సమయంలో గోరువెచ్చని నీటితో కడగాలి. చాలామందికి కాళ్లలో చెమట పడుతూ ఉంటుంది. అలాంటివారు ఈ పద్ధతిని ప్రయోగిస్తే పాదాలు సురక్షితంగా ఉంటాయి. చాలామందికి కాళ్లలో తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. కాళ్లలో పట్టు ఉండదు.
నరాలు బిగుసుకుపోవడం, ఎముకల్లో నొప్పులు రావడం, కండరాలు పట్టేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది అధిక బరువు ఉన్న వారిలో ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వారు గోరువెచ్చని నీటితో పాదాలను, కాళ్ళను కడిగితే ఆ సమస్య నుంచి వారు ఉపశమనం పొందవచ్చు. లేకపోతే ఒక బకెట్ నీళ్లలో గోరువెచ్చని నీటిని తీసుకొని పాదాలు కాసేపు అందులో పెట్టి రిలాక్స్ అవ్వవచ్చు.