Interesting Facts : ఈ భూమ్మీద ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. కొన్ని మనల్ని అబ్బురపరిస్తే.. ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో రామప్ప దేవాలయం ఉంది. ఈ అపురూప శిల్పకలా వైభవాన్ని క్రీస్తు శకం 1217లో కాకతీయుల సైన్యాధ్యక్షుడు అయిన “రేచర్ల రుద్రుడు” నిర్మించాడు.
అయితే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం పక్కనే రామప్ప చెరువు ఉంటుంది. రామప్ప చెరువులో వేసే ఇటుకలు నీళ్లలో మునగకుండా పైకి తేలుతాయి. ఇదే ఈ ఆలయంలో యొక్క ప్రత్యేకత. ఆలయం మొత్తం కూడా ఇసుక మీద నిర్మించడం కూడా అందరినీ ఆశ్చర్యాన్ని పరుస్తుంది.
ఇంతకీ ఇటుకలు నీటిపై ఎందుకు తేలుతాయంటే..
ఇటుకలు తయారు చేసేటప్పుడు పక్కనే ఉన్న రామప్ప చెరువు మట్టిని ఇటుకల తయారీ కోసం వాడుతారు. ఇలా తయారు చేసేటప్పుడు తేలికగా ఉండే గింజలు, రంపము పొట్టు, రేగి పళ్ళు, వరి పొట్టు ఇవన్నీ కలిపి ఇటుక మధ్యలో పెట్టి ఆ ఇటుకను తీసుకెళ్లి ఇటుక బట్టీలో పెడతారు. ఆ మంటలకు లోపల ఉన్న విత్తనాలు మిగతా పదార్థాలు అన్ని కాలిపోయి ఆ స్థానంలో ఖాళీ ఏర్పడుతుంది.
పైకి ఇటుక గట్టిగా ఉంటుంది కానీ లోపల ఖాళీలు ఏర్పడడం వల్ల ద్రవ్యరాశి తగ్గుతుంది. ఇలా ద్రవ్యరాశి తగ్గినా కూడా పైకి ఘన పదార్థంలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ ఇటుక సాంద్రత మాత్రం తగ్గుతుంది. ఇలా తగ్గిన సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ ఉండేలా చేస్తే అటువంటి ఇటుకలు నీటిపై తేలుతాయి.
ఎన్నో సంవత్సరాల నుండి ఈ అద్భుతాన్ని చూసి పర్యాటకులు అబ్బురపడిపోతున్నారు. ఇప్పుడున్న టెక్నికల్ ప్రపంచంలో ఇది మామూలు విషయమే కానీ, కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఇలా సైంటిఫిక్ గా ఆలోచించారు అంటే అది అందరి ఈ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంత అద్భుతంగా, సైటిఫిక్ గా ఆలోచించడం అంటే మామూలు విషయం కాదు.
Discussion about this post