Nightmares : ప్రతి ఒక్కరికి కలలు రావడం అనేది సహజ ప్రక్రియ. మనకు తెలియకుండానే మనం నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తుంటాయి. దాంట్లో కొన్ని మంచి కలలు ఉంటాయి, కొన్ని చెడు కలలు ఉంటాయి. కలల ప్రభావం మనకు ఆ రోజు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా పీడకలలు ఊరికే వచ్చి మానసికంగా ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తూ ఉంటాయి.
పదే పదే పీడకలలు వస్తే దేనికి సంకేతం. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా మనం కింద పడిపోయినట్టు అనిపించడం, ఏదో చీకట్లో చిక్కుకున్నట్టుగా, దయ్యాలు మన వెంట పడ్డట్టుగా అనిపించడం లాంటివి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇవి వచ్చినప్పుడు ఆ ప్రభావం మన గుండె పైన పడుతూ ఉంటుంది.
మనం చాలా భయపడిపోతూ ఉంటాము. చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. అయితే ఈ కలలు రాకుండా ప్రశాంతంగా నిద్రపోవాలి అని అంటే దానికి పరిష్కారం కూడా మనం తినే ఆహారంలోనే ఉంటుంది. ముందు మనం ప్రశాంతమైన నిద్రపోతే ఎటువంటి కలలు కూడా వచ్చి మనల్ని అసౌకర్యానికి గురి చేయవు. అయితే ప్రశాంతమైన నిద్ర కొరకు, రాత్రి నిద్రించే సమయం కంటే ముందు
చామంతి టీ నీ లేదా లేవండర్ టీ నీ తాగడం ఉత్తమం. దానివల్ల మనకు సుఖవంతమైన నిద్ర పడుతుంది. వాటితోపాటు క్యాల్షియం ఎక్కువగా ఉండే పెరుగు, పాలు, లాంటి పదార్థాలు కూడా తీసుకోవచ్చును. అలాగే బచ్చల కూర, ఆకుకూరలు కూడా తీసుకుంటే పీడకడలు రాకుండా మంచి నిద్ర వస్తుంది.
చేపలు, గుడ్లు, కాలీఫ్లవర్ మొలకెత్తిన విత్తనాలు వంటివి కూడా మంచి నిద్రను ఇస్తాయి. అలాగే చిలగడ దుంపలు, బ్రైన్ రైస్ వంటి పిండి పదార్థాలు కలిగిన ఆహారాన్ని కూడా తీసుకోవడం మంచిది, అరటిపండు, తృణధాన్యాలు కూడా మంచి నిద్రను ఇస్తాయి. మీరు తీసుకునే ఆహారంలో, ఈ ఆహార పదార్థాలను కూడా చేర్చి మంచి నిద్రను పొంది పీడకల నుంచి ఉపశమనం పొందండి.