Director Sukumar : పుష్పతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు లెక్కల మాస్టర్ డైరెక్టర్ సుకుమార్. మొదటి సినిమా అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్యతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు సుకుమార్. 4కోట్లు పెట్టి తీసిన సినిమా 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తరువాత తీసిన “జగడం” కొంత నిరుత్సాహ పరిచినా 100% లవ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. 1 నేనొక్కడినే అంటూ మహేష్ బాబుతో ఓ హాలీవుడ్ రేంజ్ మూవీ తీసాడు సుక్కు సార్ కానీ
తెలుగు ప్రేక్షకులు ఆ ప్రయోగాత్మక చిత్రాన్ని అర్థం చేసుకోలేకపోయారు అయినా ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్పతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న సుకుమార్. ఓ వైపు తన ఓన్ మూవీస్ చేసుకుంటూనే సుకుమార్ రైటింగ్స్ ద్వారా తన అసిస్టెంట్ డైరెక్టర్స్ ని డైరెక్టర్స్ గా పరిచయం చేస్తున్నాడు సుక్కు సార్. తన AD ల కథకు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ప్రాజెక్ట్ సెట్ చేయడంలోనూ కీ రోల్ ప్లే చేస్తాడు సుకుమార్.
తాజాగా సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన మరో సినిమా విరూపాక్ష. ఈ కథని సాయిధరమ్కి వినిపించి, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ని లింక్ చేశాడు సుకుమార్. కథలో సుక్కు మార్క్ కనిపించకపోయినా, కీలకమైన మలుపుల విషయంలో సుకుమార్ సలహాలు బాగా పనిచేశాయి. అయితే ఈ మూవీకి సుకుమార్ వాటాగా రూ.6 కోట్లు దక్కించుకొన్నాడు. ఈ సినిమా కోసం సుకుమార్ పెట్టిన పెట్టుబడి… తన తెలివితేటలే.
ఫలితంగా మూవీ హిట్ అవ్వడంతో పాటు సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది విరూపాక్ష. గత కొన్నాళ్లగా సుక్కు మాస్టర్ స్కూల్ నుంచి వచ్చిన డైరెక్టర్స్ వరుస హిట్లు కొడుతున్న విషయం తెలిసిందే. అలాగే ఈ ఏడాది సుకుమార్ రైటింగ్స్ నుంచి మరో ఇద్దరు శిష్యులు మెగా ఫోన్ పట్టబోతున్నారని టాక్. అందులో ఓ లేడీ డైరెక్టర్ ఉందట. ప్రస్తుతం పుష్ప కు AD గా దేవి నాగవల్లి వర్క్ చేస్తుంది. ఇక నుంచి సుకుమార్ రైటింగ్స్ నుంచి వరుసగా సినిమాలు చేస్తూ తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేయాలని ఫిక్సయ్యాడట సుకుమార్.
Discussion about this post