Krithi Shetty : ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతిశెట్టి. డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 2021లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. యంగ్ కాలేజ్ గర్ల్ గా కృతి కుర్ర మనసుల్ని దోచేసింది. ఉప్పెన సక్సెస్ తో కృతికి ఒక్కసారిగా ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆమె రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్, మూడో చిత్రం బంగార్రాజు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకుంది. అయితే గతకొంత కాలంగా కృతికి తిరోగమనం మొదలైనట్లు కనిపిస్తుంది.
కృతిశెట్టి నటించిన ది వారియర్ మూవీ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం చిత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దాని తర్వాత విడుదలైన సుధీర్ బాబు హీరోగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా ఫ్లాప్ అవ్వడంతో కృతి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ లు చేరినట్టైంది. అప్పట్లో ఇంకొన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీని ఏలేస్తుంది ఈ అమ్మడు అంటూ ఓ రేంజ్ లో వార్తలొచ్చాయి.
సీన్ కట్ చేస్తే.. ఆ తర్వాత రిలీజ్ అయిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతం కృతి నాగ చైతన్య సరసన ‘కస్టడీ’, శర్వానంద్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. మరో మలయాళం సినిమాలో కూడా నటిస్తుందని టాక్ వినిపించింది. ఇవి తప్ప ఆమె ఖాతాలో మరో సినిమా లేదు. ఇవి కూడా సక్సెస్ అయితేనే బేబమ్మకు మరిన్ని ఆఫర్లు వస్తాయి.
మరోపక్క ఆమె పారితోషికం కోటి పది లక్షల నుండి 50 లక్షలకు పడిపోయినట్టు తెలుస్తుంది. బంగార్రాజు మూవీ వరకు కృతిశెట్టి పారితోషికానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిందట. అందువల్లనే ఉప్పెన బ్యూటీకి అవకాశాలు లేకుండా పోయాయి అంటూ ఇండస్ట్రీలో టాక్. మరోపక్క యంగ్ బ్యూటీ శ్రీలీల, సంయుక్త మీనన్ వంటి భామలు దూసుకుచేస్తున్నారు. వీరి పోటీని తట్టుకొని నిలబడాలి అంటే కృతికి హిట్ పక్కా పడాల్సిందే..
Discussion about this post