4 Corona Positive Cases in Krishna Districts : కరోనా ఈ పేరు వింటేనే ఒకలాంటి భయం జనాల్లో పుట్టుకొస్తుంది. కరోనా అంతలా జనావాసాలను భయభ్రాంతులకు గురిచేసి, మానవ జీవితాన్ని అతలాకుతలం చేసి, అస్తవ్యస్తంగా మార్చిన రోజులు ఎవరు ఇప్పటికీ మర్చిపోలేరు. ఈ మహమ్మారి బారి నుండి అందరము బయటపడ్డామని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఏదో ఒక కొత్త వైరస్ వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది.
దానికి తోడు ఇప్పుడు ఉన్నటువంటి, ఆహార పదార్థాల కల్తీ కూడా ప్రజల అనారోగ్య సమస్యలకు మరొక రకంగా కారణమని చెప్పవచ్చు. అయితే ఈ కరోనా మహమ్మారి మల్లోసారి విజృంభించింది. కరోనా సబ్ వేరియంట్ అంటూ మళ్ళీ ఒక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. దగ్గు, జలుబు, జ్వరముతో మొదలయ్యే దీని లక్షణాలు, సరైన సమయంలో గుర్తించి చికిత్స
తీసుకోకపోతే, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వరకు వెళ్లి ప్రాణహాని జరిగే అంతలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఇప్పటికే ఈ కరోనా హైదరాబాదులో ఒకరి మరణాన్ని, మరికొన్ని కేసులను ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రాలో కూడా కరోనా కేసులు బయటపడ్డాయి. కృష్ణా జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డట్టు సమాచారం.
గన్నవరంలో ఒకటి, మచిలీపట్నంలో ఒకటి, కానూరులో రెండు కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కరోనా విస్తరించకుండా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ మళ్ళీ ఎప్పటిలాగే మాస్క్ ధరించి, అవసరమైతేనే ప్రయాణాలు చేయడం మంచిది. లేకపోతే ఇది మళ్ళీ వ్యాప్తి చెందడానికి ఎంతో సమయం పట్టదు.