Akhil Akkineni : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అఖిల్.. గతంలో అఖిల్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. దీంతో ఆశలన్నీ లేటెస్ట్ మూవీ ఏజెంట్ పైనే పెట్టుకున్నాడు అఖిల్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా డెబ్యూట్ ఇస్తుండగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 28న రిలీజ్ కు రెడీ అవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు.
ఎక్కువ టైమ్ లేకపోవడంతో పాన్ ఇండియా రిలీజ్ ను వాయిదా వేసుకొని కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ పాల్గొన్న ప్రతీ సారి షూటింగ్ డిలే, ఓవర్ బడ్జెట్ అనే క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. ఈ క్వశ్చన్స్ విన్న ప్రతీసారి కొద్దిగా ఇరిటేట్ అవుతున్నాడు అఖిల్. తాజాగా కూడా ఆ ప్రశ్నకి ఇరిటేషన్ గా ఫీలయ్యాడు అఖిల్. డిలే అనొద్దు, అయినా మేము షూట్ చేసింది కేవలం 105 రోజులే అంటూ ఏదో లెక్క చెప్పుకొచ్చాడు.
నిజానికి ఈ సినిమా చాలా కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. అవన్నీ చెప్పలేక అఖిల్ ఇలా కవర్ చేసుకుంటున్నాడు. ఇక తన సినిమా ప్రమోషన్స్ కి ప్రభాస్, చరణ్ వస్తున్నారా? అనే ప్రశ్నకి అఖిల్ కూల్ గానే రియాక్ట్ అయ్యాడు. ట్రైలర్ చూసి ఫోన్ లో ఇద్దరు మాట్లాడారని ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు. అఖిల్ మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టిన ఏజెంట్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Discussion about this post