Chandrababu Naidu Shocking Comments : రెండు నెలల్లో ఎన్నికలు ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేస్తూ, నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారు. ఒకపక్క వైసీపీ “సిద్ధం” అంటూ తమ ప్రచారాన్ని ముమ్మరం చేయగా, మరోపక్క తెలుగుదేశం పార్టీ “రా కదలిరా” అంటూ సభలు సమావేశాలతో ముందుకు దూసుకు వెళ్తుంది.
ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎటు చూసినా రాజకీయ పార్టీల సభా ప్రాంగణాలతో, ర్యాలీలతో, మైకుల మోతలతో నిండిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు తలపెట్టిన “రా కదలిరా” సభలలో వైసిపి ప్రభుత్వం పై మండిపడుతున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కదలిరా సభ నిర్వహించిన టిడిపి కి భారీ ఎత్తున జనసంద్రోహం హాజరైంది.
ఈ సభలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాటలు ఇప్పుడు తీవ్రదుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 2014వ సంవత్సరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని స్థానాలు గెలవడం జరిగింది. అదేవిధంగా సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
సైకో ముఖ్యమంత్రి మరో 60 రోజుల్లో ఇంటికి వెళ్లి పోవడం కచ్చితంగా జరుగుతుందని ఆయన వైసిపి కి జ్యోష్యం చెప్పారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఆయన బారి నుండి ప్రజలు ఇంకో 60 రోజుల్లో తప్పించుకోబోతున్నారు. ఆరోజు అందరం పండుగ చేసుకోవాలి. ఇలాంటి అక్రమాల ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని చంద్రబాబు చాలా సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆంధ్రలో దుమారాన్ని రేపుతున్నాయి.