S V Babu about YCP Party : జగన్ రెడ్డి ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులను భయ పెట్టి వారి సంస్థల బస్సులను వైసీపీ నిర్వహిస్తున్న రాజకీయ సభకు వాడుకోవటాన్ని పెడన నియోజవర్గం జనసేన పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది అని తెలిపారు జనసేన నాయకులు SV బాబు..
గత నాలుగు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం తమ అసమర్ధ విధానాల ద్వారా విద్య వ్యవస్థను పూర్తిగా విస్మరించింది. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాన్ని చేయకుండా కాలయాపన చేయడం ద్వారా విద్యా వ్యవస్థ పై వైసీపీకు ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది.
సిద్ధం అంటూ ఆర్భాటం చేస్తున్న జగన్ రెడ్డి దేనికి సిద్ధమో చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక విధాల సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి మరో ఐదు సంవత్సరాలు మరింత నాశనం చేయడానికి సిద్ధమా?
జనసేన, టిడిపి పొత్తు చూసి భయపడి పారిపోవడానికి సిద్ధమా? సంపూర్ణ మద్యపానం నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పి మహిళలను మోసం చేసిన జగన్ రెడ్డి మరో మారు మోసం చేయడానికి సిద్ధమా? వనరులను దోచుకుంటూ ప్రకృతి ధ్వంసానికి సిద్ధమా?
దళితులపై మరిన్ని దాడులు చేయడానికి సిద్ధమా?మూడు రాజధానులు అంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడానికి సిద్ధమా? ప్రజాస్వామ్యాన్ని మరో మారు అపహస్యం చేయడానికి సిద్ధమా?పవన్ కళ్యాణ్ గారిపై మరింతగా వ్యక్తిగత విమర్శల దాడి చేయడానికి సిద్ధమా?
వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయాలి అంటూ SV బాబు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు..వైసిపి పాలనతో ప్రజాస్వామ్యకు విధివిదానాలతో ప్రజలు విసుగు చెందారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ఇంటికి సాగనంపటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంసిద్ధంగా వున్నారు అని ఆయన తెలిపారు..