టాలెంటెడ్ హీరో కార్తీ నటించిన మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్ సర్దార్. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా.. నిర్మాతలకు కాసులు కురిపించింది. ఈ ఏడాది కార్తీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మణిరత్నం మూవీ ‘పొన్నియన్ సెల్వన్-1’లో కీలక పాత్రలో నటించిన కార్తీ.. ఆ తర్వాత ‘సర్దార్’ సినిమాలో నటనతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. సర్దార్ మూవీకి సీక్వెల్ కూడా వచ్చే ఏడాది రాబోతుండగా.. పొన్నియన్ సెల్వన్-2 కూడా త్వరలోనే సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది.
అక్టోబరు 22న రిలీజైన సర్దార్.. వాటర్ మేనేజ్మెంట్ బ్యాక్డ్రాప్తో అందర్నీ ఆలోచింపచేసింది. ఈ మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న కార్తీ తాజాగా ఆ మూవీ యూనిట్ సభ్యులకి ఊహించని గిప్ట్ పంపించాడట. సర్దార్ మూవీలో ‘వాటర్ బాటిల్స్’తో వచ్చే ప్రమాదం గురించి చూపించారు. దాంతో ఈ మూవీ యూనిట్కి సిల్వర్ వాటర్ బాటిల్స్ని కార్తీ పంపించాడట.
మార్కెట్లో ఈ వాటర్ బాటిల్ ధర రూ.30,000 వరకు ఉందని సమాచారం. సర్దార్ సినిమాలో సీనియర్ హీరోయిన్ లైలాతో పాటు రాశీ ఖన్నా, రజిష విజయన్, చంకీ పాండే తదితరులు నటించారు. తమిళ్తో పాటు తెలుగులో మంచి వసూళ్లు రాబట్టిన సర్దార్ సినిమా రూ.100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. సర్దార్ సక్సెస్తో నిర్మాత, ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్ లక్ష్మణ్కుమార్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్కు టయోటా కారును బహుమతిగా అందించిన విషయం తెలిసిందే.
Discussion about this post